Sun May 05 2024 02:04:11 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం
రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేగింది. తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది
రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేగింది. తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైలతో పాటు తొమ్మిది మంది కరోనా బారిన పడ్డారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్ గా తేలింది.
తొమ్మిది మందికి.....
కొన్ని రోజులుగా సంక్రాంతి పండగ సందర్భంగా రాజమండ్రి పట్టణలంలో విధులు నిర్వహిస్తున్న వీరికి కరోనా సోకడంతో మిగిలిన సిబ్బందిలో కూడా ఆందోళన మొదలయింది. తమతో కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మిగిలిన సిబ్బంది కూడా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
Next Story