Fri May 03 2024 11:05:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో నేడు రద్దీ పెరిగింది. భక్తులతో కంపార్ట్మెంట్లలో ఎక్కువ నిండిపోయాయి.
తిరుమలలో నేడు రద్దీ పెరిగింది. భక్తులతో కంపార్ట్మెంట్లలో ఎక్కువ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. గత రెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అయితే శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. పరీక్షలు పూర్తికావడంతో రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
పదహారు గంటలు...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించని భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,459 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story