Fri May 03 2024 17:15:41 GMT+0000 (Coordinated Universal Time)
కాపులను మళ్లీ కెలికిన వర్మ
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలి పెట్టడం లేదు. ఆయన అందులో వేలుపెట్టి మరీ గెలుకుతున్నారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలి పెట్టడం లేదు. ఆయన అందులో వేలుపెట్టి మరీ గెలుకుతున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిగిన భేటీపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యారు. కాపు సామాజికవర్గానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. రాంగోపాల్ వర్మకు కాపు సామాజికవర్గం నేతలు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా వర్మలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
తాజా ట్వీట్ తో...
తాజాగా కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ అర్థంకాని గణితాలతో మళ్లీ ఒక ట్వీట్ చేశారు. దీన్ని బట్టి కాపులు, కమ్మ సామాజికవర్గం కలిసినా, జనసేన కలిసినా వచ్చే ఓట్లు లేవు అని అర్థం వచ్చే తరహాలో ఆయన ట్వీట్ చేశారు. మొన్న RIP కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు అని చేసిన ట్వీట్ వివాదం కావడంతో కామ్ గా ఉంటారని భావించిన వారికి వర్మ మళ్లీ తన ట్వీట్ తో షాక్ ఇచ్చారు.
Next Story