Sat May 04 2024 09:16:06 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి జయరాంకు ఐటీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరి జయరాంకు రెండో సారి ఆదాయపు పన్ను శాఖ నోటీసలు జారీ చేశారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరి జయరాంకు రెండో సారి ఆదాయపు పన్ను శాఖ నోటీసలు జారీ చేశారు. ఇట్టిన భూముల విషయంలో కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో ఐటీ శాఖ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ఆయన భార్యకు కూడా నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్ 3న...
ఈ నెల 17వ తేదీ లోపుగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని, ఈ విచారణకు మంత్రి జయరాంతో పాటు ఆయన భార్య కూడా హాజరుకావాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Next Story