Fri May 03 2024 06:55:12 GMT+0000 (Coordinated Universal Time)
వైవీ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్
ఉమ్మడి రాజధాని విషయంలో వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఉమ్మడి రాజధాని విషయంలో వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ గా ఉమ్మడి రాజధాని కొనసాగించడం సాధ్యం కాదన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరూ రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పడం తమ పార్టీ విధానం కాదన్నారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తమ పార్టీ విధానం ఎప్పుడూ మారలేదన్నారు.
వక్రీకకరించారని...
ఆయన మాటలను కావాలని మీడియా వక్రీకరించిందన్నారు. ఆయన ఉద్దేశ్యాలను పక్కదోవపట్టించే విధంగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి రాజధాని విషయంలో తమ పార్టీ తొలి నుంచి ఒకే విధానానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని అన్నారని, దానిని తప్పుగా అన్నట్లు చూపించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Next Story