Sat May 04 2024 11:26:07 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ న్యాయవాదులు, పౌరహక్కుల సంఘం నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ సోదాలతో ఏపీ, తెలంగాణలో కలకలం రేగింది. మొత్తం ఆరుచోట్ల ఎన్ఐఏ అధకారులు దాడులు నిర్వహిస్తుననారు. అమరబంధుమిత్రుల సంఘం, పౌరహక్కుల నేతల సంఘం ఇళ్లలో దాడులు జరుగుతున్నాయి అన్నారు.
పౌరహక్కుల సంఘం నేతల..
నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, హైదరాబాద్ లోని భవాని, అన్నపూర్ణ, అనూష, పౌర హక్కుల సంఘం నేత సురేష్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు ఎందుకు నిర్వహిస్తున్నారన్న సంగతి మాత్రం తెలియడం లేదు. ఎన్ఐఏ దాడుల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story