Sat Apr 27 2024 22:09:01 GMT+0000 (Coordinated Universal Time)
పీలేరులో టెన్షన్.. చంద్రబాబు రాకతో?
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పీలేరు సబ్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను పరామర్శించనున్నారు.
చిత్తూరు జిల్లా నారావారి పల్లిలో ఉన్న చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. పీలేరు సబ్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన పరామర్శించనున్నారు. అక్రమ కేసులు పెట్టి జైలు పాలు కావడంతో వారిని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు.
జైలులో ఉన్న...
అలాగే జైలులో ఉన్న టీడీపీ నేతల కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శిస్తారు. అయితే పీలేరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్దయెత్తున బ్యానర్లు వెలిశాయి. అయితే వైసీపీ నేతలకు నచ్చ చెప్పి పోలీసులు ఆ బ్యానర్లు తొలగించారు. పీలేరు సబ్ జైలు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story