Fri May 03 2024 05:26:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన విజయనగరం జిల్లాలోని బొబ్బిలితో పాటు కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గం సభలో పాల్గొంటారు. రా కదలిరా సభలో ఆయన ప్రసంగించనున్నారు. గత నెల 29వ తేదీ నుంచి వరసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు భారీ బహిరంగర సభల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కనిగిరి, తిరువూరు, ఆచంట, ఆళ్లగడ్డ సభల్లో పాల్గొన్న చంద్రబాబు నేడు మరో రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్ నుంచి...
హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుంచి చంద్రబాబు విజయనగరం జిల్లా బొబ్బిలికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్ లో కాకినాడ జిల్లా తుని నియోజకరవ్గానికి వెళ్లనున్నారు. తుని నియోజకవర్గంలోని ఎస్. అన్నవరంలో రా కదిలిరా సభలో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు సభలకు ఆ యా పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున కార్యకర్తలను సమీకరించే పనిలో పార్టీ నేతలున్నారు.
Next Story