Wed May 08 2024 20:42:55 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. నీళ్ల బకెట్లో పడి పసిపాప మృతి
నిజామబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని కోటగిరి మండలం ఉతండా గ్రామంలో
నిజామబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని కోటగిరి మండలం ఉతండా గ్రామంలో సోమవారం సాయంత్రం నీళ్ల బకెట్లో మునిగి ఏడాదిన్నర వయస్సున్న బాలిక మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు సోంకాంబ్లే కేశవ్, గంగామణి దంపతులు ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి వేదశ్రీ.. నీళ్లున్న బకెట్లో పడిపోయింది. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకగా.. బకెట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. వెంటనే పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలిక మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story