Mon May 06 2024 13:24:10 GMT+0000 (Coordinated Universal Time)
యాదగిరి గుట్టలో విషాదం... తండ్రీ కూతురు ఆత్మహత్య
యాదగిరి గుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఒక హోటల్ పై నుంచి దూకి తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకున్నారు.
యాదగిరి గుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఒక హోటల్ పై నుంచి దూకి తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్య కు కుటుంబ కలహాలే కారణమని చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు వారు రాసిన సూసైడ్ నోట్ ను ఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబ కలహాలే....
హైదరాబాద్ కు చెందిన చెరుకూరి సురేష్, శ్రేష్టలు తండ్రీ కూతుళ్లు. వీరిద్దరూ యాదగిరిగుట్టకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story