దగ్గుబాటి వారసుడి లాంచింగ్ అయోమయంలో పడిందా ?
ఎన్టీఆర్ ముద్దుల తనయ చిన్నమ్మగా పేరు పొందిన పురంధేశ్వరి రాజకీయాల్లో పాక్షిక విజయాలు మాత్రమే నమోదు చేశారు. ఆమె భర్త, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుది కూడా [more]
ఎన్టీఆర్ ముద్దుల తనయ చిన్నమ్మగా పేరు పొందిన పురంధేశ్వరి రాజకీయాల్లో పాక్షిక విజయాలు మాత్రమే నమోదు చేశారు. ఆమె భర్త, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుది కూడా [more]
ఎన్టీఆర్ ముద్దుల తనయ చిన్నమ్మగా పేరు పొందిన పురంధేశ్వరి రాజకీయాల్లో పాక్షిక విజయాలు మాత్రమే నమోదు చేశారు. ఆమె భర్త, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుది కూడా ఒక విధంగా విఫల రాజకీయమే. వ్రతం చెడింది, ఫలితం దక్కలేదు అన్నదానికి దగ్గుబాటిని ఉదాహరణగా చెప్పవచ్చు. తండ్రి లాంటి మామ ఎన్టీఆర్ వెన్నుపోటుకు తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుకు సహకరించి తన మంచితనాన్ని ఫణంగా పెట్టినా కూడా కనీసం ఉప ముఖ్యమంత్రి కాలేకపోయారు. అంతేనా నాటి నుంచి నేటి వరకూ మళ్ళీ ఏపీ రాజకీయాల్లో వెలగలేకపోయారు. ఇలా భార్యాభర్తల రాజకీయం క్లైమాక్స్ కి చేరితే వారసుడు హితైష్ భవిష్యత్తు మీద వారికి పెద్ద బెంగ పట్టుకుందిట.
అక్కడ అలా ….
పురంధేశ్వరిని కాంగ్రెస్ చేరదీసి రెండు సార్లు ఎంపీగా చేసింది. ఆమెను సోనియాగాంధీ ఆదరించి కేంద్ర మంత్రిగా కూడా నియమించారు. కానీ ఏపీలో కాంగ్రెస్ పతనం కావడంతో చిన్నమ్మ ఫ్లేట్ ఫిరాయించి బీజేపీ పంచన చేరారు. కేంద్ర మాజీ మంత్రిగా హోదాను ఉపయోగించుకుని ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కావచ్చునని ఆమె వ్యూహరచన చేశారు. అయితే మారిన బీజేపీ స్ట్రాటజీ బట్టి చూస్తే కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇంతే సంగతులు అన్నట్లుగా ఉంది. పైగా పురంధేశ్వరి ఎన్ని పార్టీలు మారినా కూడా అన్న ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కి కూడా తన వెంట ఉన్న పార్టీల్లోకి తీసుకురాలేదన్న సంగతి బీజేపీకి అర్ధమైపోయిదట.
మెట్టు దిగినా…..
అందుకే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి రాజకీయంగా మెతక అంటారు. ఆయన ఒకటికి రెండు మెట్లు దిగి జగన్ పార్టీలో చేరారు. నాడు కొడుకు హితైష్ పోటీ చేయడానికి పౌరసత్వ సమస్య ఉండడంతో పరుచూరి నుంచి తానే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి జగన్ తో సాన్నిహిత్యం నెరిపి అయినా తన కుమారుడి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సింది. కానీ ముందే చెప్పుకున్నట్లుగా ఇక్కడ కూడా ఆయన వ్రతం చెడ్డా ఫలితం పొందలేకపోయారు. దాంతో తప్పుడు వ్యూహాలతో వైసీపీ నుంచి బయటకు వచ్చేసి ఎటూ కాకుండా పోయారు.
బాబే దిక్కా…?
ఈ మధ్య నందమూరి బాలయ్య షష్టి పూర్తికి ఇద్దరు తోడళ్ళులూ కలిసారని ప్రచారం జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన విషయం పక్కన పెడితే కొడుకు హితైష్ ని రాజకీయంగా మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నారుట. దాంతో లోకేష్ తో కలసి టీడీపీలో చేరి ముందుకు వెళ్ళినా అభ్యంతరం లేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారని అంటారు. కానీ ఇపుడు చూస్తే టీడీపీకే సీన్ కాలి ఉంది. లోకేష్ కే ఫ్యూచర్ ఏంటో అర్ధం కాని స్థితి. ఇదిలా ఉంటే చంద్రబాబుని నమ్మే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలా రాజకీయంగా చెడ్డారు. ఇపుడు కూడా లోకేష్ కోసం బాబు తాపత్రయపడతారు తప్ప హితైష్ కి చోటు ఇస్తారా అన్నది పెద్ద డౌట్. ఇచ్చినా టీడీపీకి మళ్లీ గత వైభవం వస్తుందా అన్నది మరో డౌట్. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీలో హితైష్ చేరినా ఆ పార్టీకి ఏపీలో బలం లేదు, దాంతో దగ్గుబాటి వారి వారసుడి పొలిటికల్ లాంచింగ్ ఇపుడు అయోమయంలో పడిందట.