ఎవరు గొప్ప....??
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గాంధీ కుటుంబం తొక్కేసింది. ఆయనకు మనం ఏమి ఇచ్చాం... ఆయనకు దక్కవలిసిన ప్రచారం దక్కలేదు. ఇది ఇప్పుడు మోడీ సర్కార్ మూడు వేలకోట్ల రూపాయలతో ప్రపంచంలో అతి ఎత్తైన పటేల్ విగ్రహం, కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా సాగుతున్న ప్రచారం పై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ స్పందించారు. చరిత్ర ను వక్రీకరిస్తున్నారని అసలు చరిత్ర ఇదంటూ సుదీర్ఘ విశ్లేషణ అందించారు . ఉండవల్లి "తెలుగు పోస్ట్" కి ప్రత్యేకంగా ఇచ్చిన విశ్లేషణ యధాతధంగా.
పటేల్ - నెహ్రు వివాదం ఈనాటిది కాదు.....
సర్దార్ పటేల్ క్యాపిటలిస్ట్, జవహర్ లాల్ నెహ్రు సోషలిస్టు. డైరెక్ట్ గా చరిత్రలోకి వెళితే 1936 లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నెహ్రు కోసం పటేల్ విత్ డ్రా అయినప్పుడు నెహ్రు ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు తన ప్రసంగంలో పటేల్ డైరెక్ట్ గా ఇలా చెప్పారు. నెహ్రూ చెప్పినట్లు క్యాపిటలిజం అంత ప్రమాదం కాదు. నెహ్రు భూమి అందరికి పంచాలి అన్నది సాధ్యమయ్యేది కాదు. అప్పుడు అన్ని పార్టీలు కాంగ్రెస్ లో ఉండేవారు. జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా ఇలా అందరు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎవరి సిద్ధాంతాలు వారివి వీరంతా స్వతంత్రం కోసం కలిసే పనిచేసేవారు. అంతా మహాత్మా గాంధీ నాయకత్వంలో పనిచేసేవారు. అయితే గాంధీ తరువాత ఎవరు నెంబర్ 2 అనే అంశానికి వచ్చేటప్పటికి విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ పటేల్ నెంబర్ 2, విత్ ఇన్ మాసెస్ జవహర్ లాల్ నెహ్రు నెంబర్ 2 .అన్నారు ఉండవల్లి .
అంబేద్కర్ చెప్పింది ఏమిటి అంటే ..?
ఇది నేను చెప్పింది కాదు అంబేద్కర్ ఒక సందర్భంలో అన్నారు. నెహ్రు మీకు ఒక సినిమా యాక్టర్ లా దొరికాడు. అన్నిటికి ఏదొచ్చినా జనంలోకి నెహ్రూను పంపుతున్నారు గాంధీ అని వ్యాఖ్యానించారు. నెహ్రు సభలకు జనం బాగా వచ్చేయడం, గాంధీ గారు నెహ్రూను అందుకే సెలెక్ట్ చేయడం కూడా అందుకే కాబోలు. చరిత్రలో ఏమి చెప్పారంటే..? బ్రిటిషర్ల తో సంప్రదింపుల కోసం పటేల్ కన్నా నెహ్రు, బెటర్ అని గాంధీ చెప్పారు. ఆయన మాటను బట్టే పటేల్ ఉపప్రధానిగా ఉండేందుకు అంగీకరించారు. నిజంగా ఓటింగ్ పెడితే విత్ ఇన్ కాంగ్రెస్ పటేల్ కే ఎక్కువ మద్దతు ఉండేది. నెహ్రు రేస్ లో లేడు. కానీ ఆజాద్ తప్పుకుంటున్నాడు. ఎవరు ప్రెసిడెంట్ అయితేనే బావుంటుందని మెజారిటీ పిసిసి లు పటేల్ కే అనుకూలంగా పంపించారు. ఒకరో ఇద్దరో కృపాలాని గారికి పంపారు. అని వెల్లడించారు ఉండవల్లి.
నెహ్రు రేసులో లేరు ....
నెహ్రు అసలు రేసులోనే లేరు. కానీ గాంధీ నెహ్రూను ప్రిఫర్ చేయడానికి అదో కారణం అయివుండొచ్చు. ప్రస్ఫుటంగా కనిపించే కారణం పటేల్ కన్నా15 ఏళ్ళు నెహ్రు చిన్నవాడు. పటేల్ ను ప్రధానిని చేసివుంటే మొదటి ఎన్నికలకు పటేల్ గారు లేరు. 1950 లోనే చనిపోయారు. 1952 లో తొలి ఎన్నికలు జరిగాయి. అప్పటిదాకా మనకు నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. యుపిఎ, ఎన్ డి ఏ లా కాంగ్రెస్ నాయకత్వంలో నేషనల్ గవర్నమెంట్... సో పటేల్ నెహ్రు కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వాళ్లిద్దరూ లీడర్లు కాని సిద్ధాంత వైరుధ్యాలే వారిద్దరి మధ్య. వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఒకే లక్ష్యం కోసం ఒక్కటై పనిచేశారు. హానెస్ట్, కరపక్షన్ పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చేవారు అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు. ఆ అధికారం ప్రజల కోసం వినియోగించాలని కొంతమంది ఉంటారు. ఆ అధికారం ద్వారా పెద్ద మార్పు తెచ్చి చరిత్రలో నిలబడితే కొంతమంది ఆ అధికారం ద్వారా నా కులానికి బాగా హెల్ప్ చేసి నా కులం చెప్పినట్లే వినాలనేవారు కొందరు వుంటారు. ఎవరి స్వార్ధాలు వారికి ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా పాలిటిక్స్ అంటేనే ప్రభుత్వాన్ని రన్ చేయడమే లక్ష్యం అన్నారు ఉండవల్లి.
కాంగ్రెస్ గొప్ప అని బిజెపి ఒప్పుకుంది ...
పటేల్ ఎక్కడా చెప్పలేదు కానీ ఆయన ప్రధాని కావాలని భావించి ఉండొచ్చు. ప్రణబ్ ముఖర్జీ డైరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేశాడు. తన పుస్తకంలో నేను అవ్వాలిసింది ప్రధానిగా అని. కానీ మన్మోహన్ సింగ్ కి చ్చారు. నేను ప్రభుత్వంలో చేరనని చెప్పా అయినా సోనియా పిలిచి నన్ను నువ్వు లేకుండా ప్రభుత్వం ఎలా ఉంటుందన్నారు. కాబట్టి ఫ్లోర్ లీడర్ నాకు ఇచ్చారు. కాబట్టి ఆయన క్లియర్ గా చెప్పాడు. సో పటేల్ నెహ్రు ఇష్యూ లో పటేల్ కుటుంబం - నెహ్రు కుటుంబం హైలెట్ అన్నది .. ఏ ఆర్ఎస్ఎస్ ను పటేల్ బ్యాన్ చేశారో ఆ ఆర్ఎస్ఎస్ ను కాంగ్రెస్ లో కలిసిపొమ్మని చెప్పి గోల్వాల్కర్ కు పటేల్ లెటర్ రాశారో ఆ పార్టీ వాళ్ళు పటేల్ గొప్పా నెహ్రు గొప్పా అని ఎత్తడం ద్వారా కాంగ్రెస్ గొప్పది అని ఒప్పుకున్నారు. నెహ్రు గొప్పా ? శ్యామ్ ప్రసాద్ గొప్పా ? గాంధీ గొప్పా ? హెగ్డేవార్ గొప్పా ? , గాంధీ గొప్పా ? గురూజీ గోల్ వల్కర్ గొప్పా ?, గాంధీ గొప్పా సావర్కర్ గొప్పా ? ఇలాంటిది తెచ్చి ఉంటే బిజెపి ఐడియాలజీ గొప్పదా ? కాంగ్రెస్ ఐడియాలజీ గొప్పదా అనే ఆలోచన ప్రజల్లో వచ్చి ఉండేది. వాళ్ళు చెబుతున్నది గాంధీ గొప్పా పటేల్ గొప్పా అనేది కాంగ్రెస్ అనేది గొప్పా అనేది ఒప్పేసుకున్నారు . అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే పటేల్ కుటుంబాన్ని ఏమీ విస్మరించలేదు. అని వివరించారు అరుణ కుమార్.
పటేల్ కుటుంబం ఆ విధంగా తెరమరుగు ...
సర్దార్ పటేల్ కుమార్తె లోక్ సభకు ఆయన పోయాకా రెండు, మూడు సార్లు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ అవ్వలేదు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిలోకి రాజ్యసభ మెంబర్ అయ్యివచ్చారు తప్పా ఇందిర ఎన్నికల్లో నిలబడలేదు. ఇందిర నెహ్రు కూతురు అని ఆయనేమి చేయలేదు. కానీ పటేల్ కూతురు ఆరోజు అవసరం స్టేటస్ స్టేచర్ అది పటేల్ గారికి కొడుకు ఉండేవాడు దయాభాయ్. ఆయన కూడా ఎంపి చేసాడు. నాకు గుర్తుంది కరెక్ట్ అయితే కూతురు మూడుసార్లు కొడుకు ఎంపీలుగా పనిచేశారు. ఆ తరువాత రాజకీయాల నుంచి ఆ కుటుంబం విరమించుకుంది. నెమ్మది నెమ్మదిగా ఫెడ్ అయిపోయారు. అని విశ్లేషించారు ఉండవల్లి.
( ఇంకా వుంది )
- Tags
- bharathiya janatha party
- ex parlament member
- india
- indian national congress
- indiragandhi
- jawaharlal nehru
- mahatma gandhi
- pranab mukherjee
- sardar vallabhai patel
- undavalli arun kumar
- ఇందిరాగాంధీ
- ఉండవల్లి అరుణ్ కుమార్
- జవహర్ లాల్ నెహ్రూ
- ప్రణబ్ ముఖర్జీ
- భారత జాతీ కాంగ్రెస్
- భారత దేశము
- భారతీయ జనతా పార్టీ
- మహాత్మాగాంధీ
- మాజీ పార్లమెంటు సభ్యులు
- సర్దార్ వల్లభాయ్ పటేల్