అంతా జై మయం
ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ విడుదలైన మొదటి షోకే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. అయితే ఏ ఈసినిమా ఇంతిలా హిట్ అవడానికి కారణం మాత్రమ్ జై లవ కుశ క్లైమాక్స్ అంటున్నారు.ఓ సినిమాకి క్లైమాక్స్ ఎంత కీలకమో జై లవకుశతో అర్థమైంది అంటున్నారు. అంతే కాదు ఒక మంచి కథకి ఒక టాలెంట్ ఉన్న నటుడు తోడైతే సినిమా ఫలితం కూడా బావుంటుందని జై లవ కుశ నిరూపించింది అంటున్నారు.
ఇక జై లవ కుశ ప్రీ క్లైమాక్స్లో ఆడిన నాటకం గనుక రక్తి కట్టకపోతే..... లవకుశనీ ఒక నాటకంలా చూడాల్సివచ్చేది. నిజం చెప్పాలంటే... భరించాల్సివచ్చేది. కేవలం ఆ ఎపిసోడ్తో లవకుశ పాత్రలకు ప్రాణం వచ్చింది. ఇక క్లైమాక్స్ లో జై ప్రాణం పోవడంతో... జై లవ కుశ సినిమా నిండుగా ఊపిరి పోసుకొంది. అయితే సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయిన ప్రేక్షకుడు బయటకు వచ్చాక జై బతకొచ్చు కదా.....ఆ దిశగా దర్శకుడు క్లైమాక్స్ రాసుకోవాల్సింది కదా..... అని అనిపించింది అంటె సినిమాలోని మైనసులన్నీ పూర్తిగా మర్చిపోయిన తర్వాతే అలా అనుకోవాలి. ఆ మ్యాజిక్ ని ఒక్క ఎన్టీఆర్ ఒక్కడే చేయగలిగాడు. అందుకే... ఈ జై లవ కుశ సినిమా తాలుకూ క్రెడిట్ పూర్తిగా జై పాత్రకే సొంతం. జై రావాణా.. జై జై రావాణా... జయహో జై అంటూ ఎన్టీఆర్ అభిమానాలు మాత్రం పండగ చేసుకుంటున్నారు.