ఖైదీ నెం.150 తరువాత చిరు ఇంతటి వైఫల్యం చూడాల్సివచ్చిందే
దాదాపు 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత మెగా స్టార్ చిరంజీవి వెండితెర పై అభిమానులకి దర్శనమిచ్చిన చిత్రం ఖైదీ నెం.150 ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని వసూళ్ల చరిత్రలో ఎన్నో కొత్త అధ్యయనాలు రాసింది. వెండితెరపై మెగా స్టార్ కి అంతటి గ్రాండ్ వెల్కమ్ పలికిన ప్రేక్షకులు ఆయన బుల్లి తెరపై ప్రత్యక్షమైతే మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరించటం లేదు. ఏడాదిన్నర్ర క్రితం కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ ఐయ్యింది. ఆ సీజన్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు కి మా ఛానల్ లోని కార్యక్రమాలలోనే కాక ఇతర తెలుగు చానెల్స్ లో పాపులర్ ప్రోగ్రామ్స్ కంటే కూడా అధికంగా టీఆర్ పీ రేటింగ్స్ దక్కేవి.
తరువాతి సీజన్స్ లో నాగార్జున హోస్ట్ చేసిన ఎపిసోడ్స్ కి కూడా క్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేసే బాధ్యతలు మెగా స్టార్ చిరంజీవి తీసుకోవటంతో షో కి తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆశించిన స్టార్ మా యాజమాన్యానికి నిరాశే మిగులుతోంది. చిరంజీవి హోస్ట్ చేసిన ఎపిసోడ్స్ టెలికాస్ట్ ఇప్పటికే ఫుల్ పబ్లిసిటీతో మొదలు అయినప్పటికీ బుల్లి తెరపై మెగా స్టార్ క్రేజ్ కనీసం గత సీజన్ టీఆర్ పీ రేటింగ్స్ ని సమం చేయటానికి కూడా ఉపయోగపడకపోవటం గమనార్హం. తెలుగు చానెల్స్ లో ప్రసారమయ్యే ధారావాహికలు, రియాలిటీ షోస్, లైవ్ షోస్ ల టీఆర్ పీ రేటింగ్స్ లిస్టులో తొలి ఐదు స్థానాలలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి చోటు దక్కకపోవడం బాధాకరం.
- Tags
- చిరంజీవి