గాలి వారి వేడుకలో అలరించనున్న హీరోయిన్లు
గనుల కుంభకోణంలో జైలు శిక్షను అనుభవించిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకుడు, మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషి ఐన గాలి జనార్దన్ రెడ్డి పేరు వినని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు ఏమో. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పెద్ద నోట్ల రద్దు చట్టం తో సొమ్ము వున్న సంపన్నులు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ వారి దాడులలో అనేక పర్యాయాలు గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో, ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు జరిపి లెక్కల్లో చూపించని సంపదను స్వాధీనపరుచుకున్నారు. అయినప్పటికీ ఆయన దగ్గర ఇంకా నల్ల ధనం మూలుగుతూనే వుంది.
ఈ నెల 16 ఆయన కుమార్తె వివాహానికి ముందుగానే ముహూర్తం కుదుర్చుకున్నారు. కాగా ఇంతలో పెద్ద నోట్ల రద్దు కారణాన గాలి వారి ఇంట వివాహం వాయిదా పడుతుంది అని అందరూ ఊహించగా ఆయన మాత్రం అనుకున్న ముహుర్తానికే ఏ మాత్రం ఆడంబరం తగ్గకుండా అంగ రంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు జరుపుతున్నారు. వివాహం ముందు జరిగే సంగీత్ కార్యక్రమానికి తెలుగు సినిమా కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణిల నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేసారు అంట గాలి. ఇందుకోసం ఆ తారలకు వారి మూడు చిత్రాల పారితోషికాన్ని ఒక వేడుకలో నృత్యానికి ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని వినికిడి.
ప్రస్తుతం ధ్రువ పాత చిత్రీకరణ కోసం థాయిలాండ్ లో వున్న రకుల్ రేపు చిత్రీకరణ ముగించుకుని ఇండియా తిరిగి రానుంది.