చరణ్, బన్నీతో కలిసి.. !!
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత వక్కంతం వంశి దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్నాడు. డీజే చిత్రానికి హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్స్ వర్షం మాత్రం బాగా కురిపించింది. అయితే ఇదే ఊపులో అల్లు అర్జున్ నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఊటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాతో స్టార్ రైటర్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో మిలటరీ ఆఫీసర్ గా కనబడనున్నాడు అల్లు అర్జున్. దేశభక్తి నేఫథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ రామ్ చరణ్ నటిస్తాడని ప్రచారం జోరుగా జరిగింది.
చెర్రీ కాదనడంతో....
నా పేరు సూర్య కథలో కీలకమైన ఓ మిలటరీ ఆఫీసర్ రోల్ కోసం చరణ్ చిత్ర బృందం అడిగినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ విషయం మాత్రం చిత్ర యూనిట్ ఎక్కడా బయటపెట్టలేదు. ఇకపోతే ఇప్పుడు చరణ్ నా పేరు సూర్య కోసం రావడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉండి తాను ఆ పాత్ర చేయలేనని చరణ్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక రామ్ చరణ్ ఇలా అనడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఆ స్పెషల్ రోల్ కోసం మరో హీరోని వెతికే పనిలో ఉన్నారని. తెలుస్తుంది. మరి కేవలం గెస్ట్ రోల్ కోసం రామ్ చరణ్ చెయ్యననడం ఏమిటా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు కొందరు మెగాఫాన్స్.ఎందుకంటే గతంలో రామచరణ్ కోసం ఎవడు సినిమాలో బన్నీ అయిదు నిమిషాల పటు గెస్ట్ రోల్ లో నటించాడు. మరి ఆ కృతజ్ఞతతోనైనా చరణ్, బన్నీ కోసం నా పేరు సూర్య లో చెయ్యాల్సిందనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. అసలు నా పేరు సూర్య చిత్ర బృందం చరణ్ ని అడిగినట్లుగా... చరణ్ కుదరదన్నట్లు ఎక్కడా కన్ ఫర్మ్ మాత్రం కాలేదు.