మలయాళంలోకి అడుగు పెడుతున్న రానా!!
టాలీవుడ్ లో ప్రస్తుతం రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రానా దగ్గుబాటి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను దూరం పెడుతున్నాడు. అంతేకాకుండా నిర్మాతలకు బయ్యర్లకు లాభం అందిస్తూ..తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకుంటున్నాడు.
ట్రావెన్ కోర్ మహారాజు...
ఏదన్నా కొత్త కథ ఉంటే వంటనే చేయటానికి ట్రై చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే..రీసెంట్ గా రానా మరొక చరిత్రాత్మక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా మలయాళం నుండి అందుకోవడం విశేషం. ట్రావన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ కథ ఆధారంగా మలయాళంలో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనుంది. ఆనంతపద్మనాభ స్వామి దేవాలయన్నీ నిర్మించింది..అందులో ధనాన్ని దాచింది ఈ రాజే.
కేరళకు వెళ్లి...
ఈ కథ గురించి మరింత తెలుసుకునేటందుకు రీసెంట్ గా రానా కేరళకు వెళ్ళాడు. అక్కడ ఆనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కథ గురించి వారి కుటుంబాలని గురించి తెలుసుకున్నాడు. మరి కొన్ని నెలల్లోనే రానా ఆ సినిమాను సెట్స్ పైకి తిసుకెళ్లాలని చిత్ర యూనిట్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
- Tags
- రానా