మైత్రికి హ్యాండ్ ఇవ్వడా?
పవన్ కళ్యాణ్ గతంలో లా పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తాడా అనే దానికి పూర్తిగా క్లారిటీ ఉంది.ఎందుకంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా బిజీ అయ్యాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ సినిమాలు చేస్తాడా? అంటే అదో పెద్ద డౌటే. మరి ఇప్పటికే రాజకీయాలను పక్కన పెట్టి మరి అజ్ఞాతవాసి ని పూర్తి చేసి డిజాస్టర్ అందుకున్న పవన్ 2019 ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాడు. మరి మూడు సినిమాలను లైన్ లో పెట్టడమే కాక నిర్మాతల నుండి కోట్ల రూపాయలు అడ్వాన్స్ లుగా తీసుకున్నాడు పవన్. మరి ఇప్పుడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెడితే ఆ అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చెయ్యాలి. లేదంటే సినిమా చెయ్యాలి. అయితే ప్రస్తుతం రాజకీయాలతో పాటే పవన్ ఒక సినిమాని పట్టాలెక్కించనున్నాడనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో బయలు దేరింది.
2019 ఎన్నికల నాటికీ పవన్ ఒక సినిమాని ఫినిష్ చెయ్యొచ్చనే ఉద్దేశ్యంతో మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చిన అడ్వాన్స్ కింద ఒక సినిమా చెయ్యాలని పవన్ భావిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరి పవన్ కి అడ్వాన్స్ లు ఇచ్చి నోరు తెరవలేక గప్ చిప్ గా వున్న మైత్రి మూవీస్ వాళ్ళు పవన్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారంటున్నారు. మరి ఈ సినిమా చేసేస్తే వచ్చిన డబ్బుని మిగతా నిర్మాతలకు అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చెయ్యొచ్చనే ఉద్దేశ్యం కూడా పవన్ కి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అతి త్వరలోనే పవన్ కి మైత్రి వారికీ మధ్య చర్చలు జరిగి ఒక మూవీ స్టార్ట్ కానుందనే న్యూస్ తో పవన్ ఫాన్స్ కి పిచ్చెక్కిస్తుంది.
చూద్దాం పవన్ కళ్యాణ్ మరి రాజకీయాలను ప్రస్తుతానికి సైడ్ చేసి సినిమా చేస్తాడా? లేదా? అనేది మాత్రం ఆ సినిమా పట్టాలెక్కేవరకు డౌట్.