రాజు గారి సినిమాలో మరోసారి నటించనున్న సుప్రీమ్ హీరో
షూటింగ్ ముందుగా ప్రారంభమైయింది వై.వి.ఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రేయ్ చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులకి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిచయం ఐయ్యింది మాత్రం పిల్ల నువ్వు లేని జీవితం ద్వారా. ఆ చిత్రంతో సక్సెస్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ వేణు వెంటనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలు చేసి వరుస విజయాలు అందుకున్నాడు. మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకి కూడా ఆ చిత్రాలు చేరువ అవ్వటంతో సాయి ధరమ్ తేజ్ అప్పటి నుంచే సుప్రీమ్ హీరో అయిపోయాడు. అయితే దిల్ రాజు నిర్మాణంలో చేసిన సుప్రీమ్ తరువాత తేజు తిక్క, విన్నర్ చిత్రాలలో నటించినప్పటికీ విజయం వరించలేదు.
ప్రస్తుతం కథా రచయిత బి.వి.ఎస్.రవి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రం లో కథానాయకుడిగా నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ తన సక్సెస్ ట్రాక్ తిరిగి తెచ్చుకోవటానికి తరువాతి చిత్రం దిల్ రాజు నిర్మాణంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నాడు. కాగా దిల్ రాజు కూడా సాయి ధరమ్ తేజ్ కోసం ఒక కథ సిద్ధం చేపిస్తున్నారు. శతమానం భవతి తో సూపర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న శ్రీనివాస కళ్యాణం అనే కథ తయారు చేసి ఆ కథని ఇప్పటికే తేజుకి ఫస్ట్ నేరేషన్ ఇచ్చేసాడు. ప్రస్తుతం కథకి ట్రీట్మెంట్ చేస్తున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని కూడా తనకి శతమానం భవతి తో అద్భుతమైన అవకాశం ఇచ్చిన దిల్ రాజు నిర్మాణంలోనే చేయనున్నాడు. అలా దిల్ రాజుకి తాను సక్సెస్ ఇచ్చిన హీరో, సక్సెస్ ఇచ్చిన దర్శకుడు కలిసి ఒకే సినిమాకి కాంబినేషన్ గా సెట్ అవుతున్నారు.
- Tags
- దిల్ రాజు