మైత్రి డేరింగ్ చుస్తే ఆశ్చర్యపోవాలి
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకి ముందు మూడు సినిమాలు గుర్తొచ్చేస్తాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం. ఈమూడు బ్లాక్ బస్టర్స్ గా [more]
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకి ముందు మూడు సినిమాలు గుర్తొచ్చేస్తాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం. ఈమూడు బ్లాక్ బస్టర్స్ గా [more]
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకి ముందు మూడు సినిమాలు గుర్తొచ్చేస్తాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం. ఈమూడు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మొదటి నుండే బడ్జెట్ తో సంబంధం లేకుండా పెద్దపెద్ద స్టార్ ని పెట్టి సినిమాలు తీయడంలో మైత్రి ఎక్స్పర్ట్. అంతే ఈమధ్య మరో డేరింగ్ స్టెప్ వేసింది. పెద్దపెద్ద స్టార్స్ తో సినిమాలు చేసి నష్టపోవడం ఎందుకని మీడియం రేంజ్ హీరోల ని పెట్టి భారీ బడ్జెట్ పెడుతుంది.
ఈనేపధ్యంలో మైత్రి నాని తో ఓ సినిమా చేస్తుంది. గ్యాంగ్ లీడర్ అనే ఈసినిమా ను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు నెలలో రిలీజ్ అవుతున్న ఈసినిమా కోసం మైత్రి వాళ్ళు ఏకంగా 40-50 కోట్ల మేర బడ్జెట్ పెడుతోందని సమాచారం. అలానే విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఈసినిమా కూడా భారీ బడ్జెట్ పెట్టారని తెలుస్తుంది. జులై రిలీజ్ అవుతున్న ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈమూవీ రిలీజ్ కాకముందే విజయ్ తో మరో సినిమాను నిర్మిస్తుంది మైత్రి. తమిళ దర్శకుడు ఆనంద్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికోసం కూడా మైత్రి వాళ్ళు భారీగా ఖర్చు చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇందులో విజయ్ బైక్ రేసర్ గా ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారు. రేసర్ అంటే సాహసాలు మాములుగా ఉండవ్. ఇందులో రెండు మూడు సీన్స్ కోసమే ఏకంగా 8 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అందుకు సంబంధించి ఫారిన్ నుండి బైక్స్, రేసర్లు.. డ్రోన్ లు.. స్కార్పియో ఎక్విప్ మెంట్ సహా వాటన్నిటినీ ఆపరేట్ చేసే ట్రైనింగ్ ఉన్న వాళ్లను బరిలో దించుతున్నారట. అలానే రేసింగ్ ట్రాక్ కోసం కోటి కి పైనే ఖర్చు చేస్తున్నారు. ఇలా విజయ్ న్యూ మూవీ కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు మైత్రి వాళ్ళు. విజయ్ ని నమ్మి మైత్రి వాళ్ళు 40 – 50 కోట్లు వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఇలా హీరో మార్కెట్ కి సంబంధం లేకుండా డేరింగ్ చేస్తున్నారు మైత్రి వారు.