ఎన్టీఆర్ కాదన్నాడు...బన్నీ ఓకే అన్నాడా!!
అల్లు అర్జున్ - వక్కంతం వంశి కాంబోలో తెరకెక్కిన నా పేరు సూర్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నా పేరు సూర్య తో అల్లు అర్జున్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే ఈ సినిమా స్పెషల్ షోకే యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కథ చప్పగా ఉందని..ఆర్మీ నేపథ్యం ఉన్న కథలో అసలు యుద్ధ సన్నివేశాలే లేవని... ఒక్క ఫోటోగ్రఫి తప్ప సినిమా లో చెప్పుకోవడానికి ఏం లేవని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. నాపేరు సూర్య లో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ మాత్రం అదరగొట్టేస్తుందని... ఇక మిగిలినటీనటులంతా చాలా చప్పని పెరఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు.
డైరెక్షన్ గొప్పగా లేదంటూ....
అలాగే వక్కంతం వంశి డైరెక్షన్, మేకింగ్ కూడా ఏమంత గొప్పగా లేవంటున్నారు. అయితే వక్కంతం వంశి డైరెక్టర్ గా మారాలనుకున్నప్పుడు మొదటగా తన స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ని తెరకెక్కించాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్, వంశి తో సినిమా చేద్దామని చెబుతూనే.. ఇతర డైరెక్టర్స్ కి కమిట్ మెంట్స్ ఇస్తూ వంశి ని పక్కన పెట్టేసాడు. అయితే వంశి చెప్పిన కథ నచ్చకే ఎన్టీఆర్, వంశీ తో కలిసి పనిచెయ్యలేదనే టాక్ బయటికి వచ్చింది. ఈ నా పేరు సూర్య కథ నే ఎన్టీఆర్ కి వంశి వినిపించాడని.. కానీ ఎన్టీఆర్ కి ఈ కథ అంతగా ఎక్కలేదని... అందుకే ఎన్టీఆర్ ఈ సినిమా చెయ్యకుండా లైట్ తీసుకున్నాడని అంటున్నారు.
అల్లు అర్జున్ ఒప్పించి...
అదే కథతో అల్లు అర్జున్ ని ఒప్పించి వంశి నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమా చేసాడని అంటున్నారు. అయితే ఇలాంటి వార్తల నేపథ్యంలో వక్కంతం వంశీ తనదైన శైలిలో స్పందించాడు. అసలు తాను ఎన్టీఆర్ కి వినిపించిన కథ వేరనీ .. ఆ కథకు .. ఈ నా పేరు సూర్య కథకు సంబంధం లేదని చెప్పాడు. ఇక నిర్మాతలు.... అల్లు అర్జున్ కోసం కథ అడిగినప్పుడు వంశి తన స్టోరీ బ్యాంక్ లో నుంచి ఈ కథను బయటికి తీశానని చెబుతున్నాడు. కాకపోతే ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథను ఇంకా సంతృప్తికరంగా తీర్చదిద్దవలసి ఉందనీ.... ఎన్టీఆర్ కి అనుకున్న కథను ఆయనతోనే సినిమాని డైరెక్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేసాడు వంశి.