తన సినిమాను ఫ్రెండ్ కి త్యాగం చేసిన రోహిత్..!
టాలీవుడ్ లో విలక్షణమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ హిట్స్.. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం నారా రోహిత్ నైజం. సోషల్ మెసేజ్ మూవీస్ చేయడంలో కూడా రోహిత్ ముందుంటాడు. ప్రస్తుతం అతను నటించిన 'ఆటగాళ్లు' సినిమా ఈ నెల 24న విడుదల అవ్వబోతుంది. ప్రస్తుతం 'వీరభోగ వసంత రాయలు' అనే సినిమా షూటింగ్ లో ఉన్నాడు రోహిత్. తాజా సమాచారం ప్రకారం రోహిత్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట.
కథ నచ్చినా...ఖళీ లేకపోవడంతో...
తన కోసం వచ్చిన ఓ కథను తన మిత్రుడి కోసం త్యాగం చేశాడట. 'బాణం' లాంటి మంచి సినిమాను అందించిన చైతన్య దంతులూరి తెచ్చిన 'బలవంతుడ నాకేమని' కథను తన మిత్రుడికి ఇచ్చేశాడంట. ఈ కథ రోహిత్ కు తెగ నచ్చేసిందంట. తనే స్వయంగా ఆ మూవీలో యాక్ట్ చేయాలనుకున్నాడట. కానీ ప్రస్తుతం అతని చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయట. అంటే కచ్చితంగా ఏడాది తర్వాత రోహిత్ ఫ్రీ అవ్వుతాడు.
శ్రీ విష్ణుకి అప్పగించి...
ఆల్రెడీ చైతన్య దంతులూరి రోహిత్ కోసం ఏడాది పైనే వెయిట్ చేసాడట. మళ్లీ ఇప్పుడు ఇంకో ఏడాది వెయిట్ చేయించడం ఇష్టం లేక ఈ కథకు హీరోగా శ్రీవిష్ణుని తీసుకోమ్మని సూచించాడట. అంతేకాదు ఈ సినిమా తర్వాత తమ కాంబోలో ఓ సినిమా చేద్దామని ప్రామిస్ చేశాడట. తనకి ఎంతగానో నచ్చిన సబ్జెక్ట్ ను తన మిత్రుడు శ్రీవిష్ణుకి ఇచ్చేయడం చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏ లెవెల్ లో ఉందో అర్థం అవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో తెలియాలి.