Wed May 08 2024 18:18:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేత
గోషా మహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఊరట లభించింది. ఆయనపై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది
గోషా మహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఊరట లభించింది. ఆయనపై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్న రాజాసింగ్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకత్వం కూడా అభిప్రాయపడింది.
ఏడాది పైగానే....
దాదాపు ఏడాదికి పైగానే సస్పెన్షన్ వేటు అమలులో ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఆయన గోషామహల్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒక్కరే శాసనసభ్యుడిగా గెలిచారు. మరోసారి పోటీ చేసి తన ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలవుతారా? విజయం సాధిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story