Tue May 07 2024 17:14:59 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో కేఏ పాల్ హంగామా
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంటకు 41.3 శాతం పోలింగ్ నమోదయింది
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంటకు 41.3 శాతం పోలింగ్ నమోదయింది. అధికారులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ మాత్రం హడావిడి చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు. తాను యాభై వేల మెజారిటీతో గెలుస్తామని ఆయన అందరికీ చెబుతున్నారు.
ఉంగరం గుర్తును...
కేఏ పాల్ కు ఉంగరం గుర్తును కేటాయించారు. దీంతో ఆయన చేతి ఐదు వేళ్లకు ఐదు ఉంగరాలు పెట్టి పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారు. ఒకసారి పోలింగ్ కేంద్రం వద్ద తనకేందో సమాచారం అందినట్లు పరుగులు తీస్తున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ హంగామా చేసి ఇటు అధికారులు, అటు ఓటర్లు నవ్వుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఓటర్లు ఓటు వేస్తున్నారని ఆయన చెబుతున్నారు.
Next Story