Fri Mar 29 2024 05:45:26 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో తప్పిన ప్రమాదం....
విజయవాడలో ఆర్టీసీ బస్ మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. విజయవాడ నుంచి విశాఖ వెళుతున్న సూపర్ లగ్జరీ బస్ బెంజ్ సర్కిల్లో సమీపంలోని జ్యోతి మహల్ వద్ద ఎదురుగా ఉన్న లారీ ని ఢీ కొట్టింది. దీంతో రేడియేటర్ పగిలిపోయి మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల ద్వారం తెరుచుకోకపోవడంతో ఆందోళనకి గురయ్యారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తోన్న ప్రజలు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఘటనతో కిలోమీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయాయి.
- Tags
- బస్సు ప్రమాదం
Next Story