అపోహే బాలుడి ప్రాణం తీసిందా?
కన్నతల్లిదండ్రులే అపోహతో కన్నకొడుకును చంపేసుకున్నారని లోటస్ ఆస్పత్రి సీఈవో వివరణ ఇచ్చారు. అంబర్ పేట్ కు చెందిన సురేష్ చెవిలో చీము వస్తుండటంతో ఆపరేషన్ కోసం లోటస్ ఆస్పత్రిలో చేరిన సంఘటన తెలిసిందే. అయితే ఈవిషయంలో బంధువులదే తప్పంటున్నారు వైద్యులు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు. అన్ని వైద్య పత్రాలను సమర్పిస్తామని చెబుతున్నారు. వైద్యుల చెబుతున్న దాని ప్రకారం పదహారేళ్ల సురేష్ కు చెవిలో నుంచి చీము వస్తుండటంతో అన్ని వైద్య పరీక్షలు చేశామన్నారు. అయితే సురేష్ కు మెదడులో చీము పేరుకుపోయి ఉండటంతో దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చిందన్నారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత సురేష్ కొన్ని రోజుల పాటు మత్తులో ఉంటారని, ఆ విషయాన్ని ఎంత చెప్పినా బంధువులు పట్టించుకోలేదన్నారు. సురేష్ కు పెట్టిన వెంటిలేటర్ ను తొలగించాల్సిందేనని వారు బలవంత పెట్టినా తాము అంగీకరించలేదన్నారు. మత్తులో ఉన్న సురేష్ చనిపోయాడని భావించి బంధువులు తాము మృతదేహానికి వైద్యం చేస్తున్నట్లు భ్రమ పడ్డారని, వెంటిలేటర్ తొలగించమని వత్తిడి చేయడంతో తాము విధిలేని పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చిందన్నారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పడంతోనే వెంటిలేటర్ ను తొలగించామని, వెంటిలేటర్ ను తొలగించడంతో సురేష్ చనిపోయడాని వైద్యులు వివరణ ఇచ్చారు.
- Tags
- బాలుడి ప్రాణం