Fri Apr 19 2024 17:34:11 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రోళ్లకు..కేసీఆర్ కు తేడా లేదు
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మరోసారి కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ నూతన డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకూ డైరీలో తెలంగాణ ఉద్యమ కార్యాచరణను గురించి రాసుకున్నామని, ప్రస్తుతం మాత్రం తెలంగాణ నిర్మాణం గురించి రాసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి, ఇప్పటి తెలంగాణకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం కోసం ఉద్యమించామన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పనుల కాంట్రాక్టులు చేసేదంతా ఆంధ్రావారేనని కోదండరామ్ విమర్శించారు. తెలంగాణ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు వీధిన ఉన్నారని, తెలంగాణ వచ్చినా వారికి కొలువులు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలో దీనిపై ఉద్యమించనున్నట్లు ప్రకటించారు.
- Tags
- కోదండరామ్
Next Story