Sat Apr 27 2024 05:00:51 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కేంద్రం సూటి ప్రశ్న
విభజన చట్టం అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కార బాధ్యతను రాష్ట్రపతికి కట్టబెట్టిన సెక్షన్ 108ను ఎందుకు పొడిగించాలో సహేతుక కారణాలను తెలపాలని కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 108 అమలును మరో రెండేళ్ల పాటు పాటు పొడిగించాలంటూ ఏపీ సిఎం అభ్యర్ధించారు. ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడ., ఏపీ తెలంగాణల మద్య ఏదొక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రపతికి విశేష అధికారాలు మరో రెండేళ్లపాటు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై సహేతుక కారణాలను వివరించాలని కేంద్రం కోరడం విశేషం.
- Tags
- కేంద్ర ప్రభుత్వం
Next Story