Thu Apr 18 2024 20:39:05 GMT+0000 (Coordinated Universal Time)
ఐవీఆర్సీఎల్ కంపెనీపై వేటు!
కోల్కతా నగరంలో 25 మంది ప్రాణాలను బలిగొన్న వంతెనను నిర్మిస్తున్న ఐవీఆర్సీఎల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. దీంతో కోల్కతాలోని ఐవీఆర్సీఎల్ కార్యాలయాన్ని సీజ్ చేసిన పోలీసులు కంపెనీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంస్థ ప్రధాన కార్యాలయం నగరంలోని బంజారాహిల్స్లో ఉండటంతో కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించేందుకు కోల్కతా పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఘటనకు సంబంధించి అవసరమైతే సంస్థ ఉన్నతాధికారులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Next Story