కేసిఆర్ పై ఎమెల్యే పొంగులేటి ఫైర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ గురువారం అసెంబ్లీలో చెప్పిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అని సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. కోటి ఎకరాలలో నీరు అందించడం కాంగ్రెస్ చేపట్టిన 60 లక్షల ఎకరాల ప్రాజెక్టుల వల్లే సాధ్యమని చెప్పారు. వట్టిసీమ ఎలా కడతారని గతంలో ఆరోపించిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పొగడ్తల వెనక ఉన్న మతలబేమిటి అని అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసు ఏమయ్యిందని కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లు ఒక అవగాహనకు వచ్చినట్లు అనుమానంగా ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నా పట్టించుకోవడంలేదని హైకోర్టు ఆక్షేపించినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం దారుణమని సుధాకర్రెడ్డి ఆరోపించారు.