Thu Apr 25 2024 17:15:07 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఏపీ పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు చేయాల్సిన ఏపీ పర్యటన వాయిదా పడింది. సోమవారం కేసీఆర్ తిరుమల చేరుకుని వెంకటేశ్వరుడిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకోవాల్సి ఉంది. అలాగే బెజవాడ దుర్గమ్మను కూడా దర్శించుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి, బెజవాడ దుర్గమ్మకు కానుకలు సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు.
అయితే తిరుమలలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండటం, 31వ తేదీన ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు టీటీడీకి కూడా సమాచారం అందింది. తిరిగి పర్యటన ఎప్పుడు ఉండేది త్వరలో చెప్తామంటున్నారు సీఎం కార్యాలయ అధికారులు.
- Tags
- కేసీఆర్
Next Story