ఖమ్మంలో టిఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు!
గులాబీ పార్టీలో పండుగ సందడి మొదలైంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు టిఆర్ఎస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం పట్టణాన్ని ఎంపిక చేశారు సిఎం కెసిఆర్. పార్టీ ఆవిర్బవించిన నాటి నుండి ఆ జిల్లాలో పార్టీకి బలమయిన పునాదులు లేవు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. తుమ్మల నాగేశ్వరావును టిఆర్ ఎస్లో చేర్చుకుని మంత్రి పదవి క ట్టబెట్టిన కెసిఆర్ ఆయన నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తెలంగాణలో ఏ జిల్లాలో జరగని విదంగా ఒక్క ఖమ్మం జిల్లాకు సంబందించిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాలు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖమ్మం కార్పోరేషన్ పై గులాబీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్లీనరీ, బహిరంగ సభను విజయవంతం చేసేందకు టిఆర్ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నగర శివార్లలోని చెరుకూరి వారి మామిడితోట లో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ పెద్దలు దానికి సంబందించిన పనులను ప్రారంభించారు. ప్రస్తుతం రెండు డోజర్లు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాయి.