Fri Apr 19 2024 01:55:30 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు రైతుల కృతజ్ఞతలు
పట్టిసీమ నుంచి నీరిచ్చి కృష్ణా డెల్టాలో పంటలు కాపాడినందుకు డెల్టా రైతులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా పట్టిసీమ నుంచి నీటిని తరలించడంతో పంటల్ని కాపాడగలిగారు. పట్టీసీమ నుంచి నీరందిస్తున్నందుకు సీఎంను గన్నవరం విమానాశ్రయంలో సన్మానించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పట్టిసీమ నుంచి వందరోజుల్లో 64 టి.ఎం.సి. ల నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణాకు తరలించారు. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు పుష్కలంగా అందింది. దీంతో హనుమాన్ జక్షన్ నుంచి వచ్చిన వందలాది రైతులు చంద్రబాబుకు కృతజ్ఙతా పూర్వకంగా పూలమాలలు వేసి శాలువాలు కప్పారు
- Tags
- చంద్రబాబు
Next Story