Thu Apr 25 2024 06:56:36 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కేసుల గురించి వారినే అడగండి
జగన్ కేసుల గురించి తనను కాదని, వాటిని డీల్ చేస్తున్న అధికారులను అడగాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తనను పక్కన పెట్టిందనడంలో వాస్తవం లేదన్నారు. మహారాష్ట్రలో తాను 20 ఏళ్లపాటు పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. తన రాజీనామా ఆమోదించాక భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. తన సిద్ధాంతాలకు అనుగుణంగానే కార్యాచరణ ఉంటుందన్నారు.
Next Story