Thu Mar 28 2024 13:31:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ టీ 20లో బోణీ కొట్టింది....!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో ిఇండియా ఘన విజయం సాధించింది. మూడు టీ 20 మ్యాచ్ లున్న ఈ టూర్ లో తొలి వన్డేలో ఇండియా తొలి విక్టరీ కొట్టేసింది. దక్షిణాఫ్రికా కూడా గట్టి పోటీ ఇచ్చింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టి ఇండియాకు విజయాన్ని అందించారు. ఇప్పటికే వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఇండియా టీ 20 లోనూ అదే జోరును కొనసాగించింది. 204 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో175 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పరాజయం పాలయింది. మొత్తం మీద టీ 20 మ్యాచ్ లలో భారత్ తొలి బోణీ కొట్టింది.
- Tags
- క్రికెట్
Next Story