Fri Mar 29 2024 05:25:50 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ ఉండవల్లి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులో అవినీతిపై చర్చించేందుకు విజయవాడ వచ్చిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 30 అమలులో ఉండగా చర్చకు అనుమతిచ్చేది లేదని పోలీసులు చెప్పారు. ఆయనను అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఉండవల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి బహరింగ చర్చకు సిద్ధమని ఉండవల్లి సవాల్ విసిరారు. ఉండవల్లి సవాల్ కు స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చర్చకు సిద్ధమన్నారు. కృష్ణా బ్యారేజి ని వేదికగా నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరి చర్చకు పోలీసులు అనుమతించలేదు.
- Tags
- ఉండవల్లి
Next Story