Tue Apr 23 2024 16:52:30 GMT+0000 (Coordinated Universal Time)
వెంకయ్యనాయుడికి కళ్లు చెదిరే ఆస్తులు
సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు ఇంట్లో ఏసీబీ సోదాల్లో కిలోల కొద్దీ బంగారం బయటపడింది. బంగారు ఖజానానే బయటపడింది. గాజువాక సబ్ రిజిస్ట్రార్ గా వెంకయ్యనాయుడు పనిచేస్తున్నారు. వెంకయ్యనాయుడు నివాసాలపై ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిపింది. కళ్లు చెదిరిపోయే ఆస్తులున్నాయి. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కూడా ఆయనకు ఆస్తులున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ జరిపిన సోదాల్లో వెంకయ్యనాయుడు ఆస్తుల విలువ యాభై కోట్లపై మాటేనని చెబుతున్నారు. గాజువాకలో పెద్దయెత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. మొదటి భార్య పేరు మీద కూడా ఒడిషా ప్రాంతంతో కొనుగోలు చేశారు. శ్రీకాళహస్తిలో పది ఎకరాల భూమి ఉంది. ఇక బంగారమైతే లెక్కలేదు. బంగారం షాపుల్లో ఉండే నగలన్నీ ఇక్కడ ఏసీబీ అధికారులకు దర్శనమిచ్చాయి. ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
Next Story