Thu Mar 28 2024 21:45:03 GMT+0000 (Coordinated Universal Time)
శాసనసభలో తెరాస ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది!
శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని భాజపా పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గొంతుపై కత్తి పెట్టి బిల్లులను పాస్ చేయించుకున్నారన్నారు. ప్రతిపక్షంగా భాజపా తన వంతు సహకారం అందించిందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే మంత్రులు ఎదురు దాడి చేశారన్నారు. గొప్పలకుపోయి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారని, అప్పుల దిశగా రాష్ట్రం మరలుతోందన్నారు. కాగ్ సైతం ప్రభుత్వం పైన అక్షింతలు వేసిందని గుర్తు చేశారు. జల విధానంపై ముఖ్యమంత్రి చూపించిన త్రీడీ ప్రజెంటేషన్ చాలా కలర్ ఫుల్ గా ఉందని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన కరవుపై చర్చించక పోవడం దారుణమన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికున్న ప్రేమ ఏ పాటిదో స్పష్టమవుతోందన్నారు
Next Story