Thu Apr 25 2024 20:41:06 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కోర్టులో జగన్
వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు ఈరోజు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వాల్సి ఉంది. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం జగన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈరోజు వాయిదా ఉండటంతో జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు రావడంతో పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టు వెలుపల జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఉండటంతో పోలీసులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
- Tags
- జగన్
Next Story