Fri Apr 19 2024 03:11:05 GMT+0000 (Coordinated Universal Time)
సొంత జిల్లాకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైఎస్ జగన్ ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చారు. సొంత జిల్లాలో పార్టీపైన ఆయన దృష్టి పెట్టారు. కడప జిల్లాపై టీడీపీ పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తుండటం, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలు కావడం జగన్ కు కొంత ఇబ్బంది కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తరచూ సొంత జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన పులివెందుల, కడప, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
- Tags
- జగన్
Next Story