Thu Apr 25 2024 07:43:10 GMT+0000 (Coordinated Universal Time)
హరీశ్ రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారా?
గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. అయితే ఒంటేరు వ్యాఖ్యలను వెంటనే టీఆర్ఎస్ నేతలు ఖండించారు. హరీశ్ పై లేని పోని ఆరోపణలు చేయడం తగదని చెప్పారు.
Next Story