బ్రేకింగ్: అమిత్ షా కు కోపం వచ్చింది
రాష్ట్ర బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదిలోనే నేతలు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయన దిగాక కార్యకర్తలతో మాట్లాడించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. వేదిక మీదకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసిన అమిత్ షాను రాష్ట్ర బీజేపీ నేతలు గజమాలతో సత్కరించారు. అమిత్ షా మాట్లాడతారని ఎమ్మెల్సీ ప్రకటిస్తుండగానే...అమిత్ షా స్టేజి దిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా కత్రియా హోటల్ కి వెళ్లిపోయి ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశమయ్యారు. దీంతో అమిత్ షా మాట్లాడతారని ఎదురుచూసిన నేతలు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఎన్నో రోజులుగా అమిత్ షా పర్యటనకు ఎదురుచూస్తున్న వారు అసంతృప్తికి గురయ్యారు. అయితే, అమిత్ షా షెడ్యూల్ లో ఈ సభలో మాట్లాడే కార్యక్రమం లేదని తెలుస్తోంది.