Tue Apr 23 2024 14:41:58 GMT+0000 (Coordinated Universal Time)
తప్పు ఎవరు చేశారో తెలుస్తాం
సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడెతూ... తాము సీబీఐ ప్రతిష్ఠను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా పరస్పరం ఆరోపణలు చేస్తున్నారని, ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో విచారణలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్థుతం ఇద్దరి అధికారులను సెలవుపై మాత్రమే పంపించామని, ఆరోపణలపై పారదర్శకంగా విచారణ చేస్తున్నామని, ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో విచారణలో తేలుతుందని ఆయన స్పష్టం చేశారు.
Next Story