Sat Apr 20 2024 01:59:07 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై హత్యాయత్నం కేసులో విష్ణు కొత్త అనుమానం
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు. ఆపరేషన్ గరుడ గురించి వాస్తవాలను పోలీసులు బయటపెట్టాలని పేర్కొన్నారు. జరగబోయే విషయాలు చెబుతున్న శివాజి ఏమైనా జ్యోతిష్యుడా అని ప్రశ్నించారు. ఆయనను పోలీసులు ఎందుకు విచారించడం లేదన్నారు. అసలు దాడికి శివాజీయే పథకం రచించారోమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ వ్యాఖ్యనించడం సరికాదన్నారు.
Next Story