Thu Mar 28 2024 09:46:14 GMT+0000 (Coordinated Universal Time)
చిన రాజప్ప చీప్ కామెంట్స్..?
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ సంఘటనపై మాట్లాడుతూ... జగన్ పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి సరికాదన్నారు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశారని తెలిపారు. నిందితుడిది తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సమీపంలోని ఓ లంక గ్రామం అని పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అయితే, విలేకరులు అడిగిన ప్రశ్నకు చినరాజప్ప సమాధానమిస్తూ... మొద్దులు, సెల్ఫీలు అనగానే జగన్ ముందుకెళ్తారని, అది సరికాదన్నారు. ప్రజా ప్రతినిధి అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిందితుడు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Next Story