Wed Apr 24 2024 14:22:01 GMT+0000 (Coordinated Universal Time)
హరీష్ రావు, రేవంత్ కి ఈసీ నోటీసులు
ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసులతోనైనా వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా నేతల నోళ్లకి తాళం పడుతుందేమో చూడాలి.
Next Story