Wed May 08 2024 04:23:44 GMT+0000 (Coordinated Universal Time)
ఓ బచ్చా చిటికేస్తే ఢిల్లీ వెళతారా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పట్ల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా మండిపడ్డారు. 1978లో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు 1980లో మంత్రి అయ్యారని, ఆ సమయంలో అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే ఐదేళ్ల వయస్సులో అఖిలేష్ ఉన్నాడని పేర్కొన్నారు. అందరికంటే సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబు కు అఖిలేష్ అనే బచ్చా చిటికేస్తే ఢిల్లీకి వెళ్లడం సిగ్గనిపించలేదా అని ప్రశ్నించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచడం కదా అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Next Story