Wed May 08 2024 03:02:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ ఇంటికి వైద్య బృందం
హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ని వైద్యులు ఇవాళ మరోసారి పరీక్షించారు. శనివారం నుంచి జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ గాయాన్ని సిటి న్యూరో సెంటర్ కి చెందిన నలుగురు వైద్యులు పరీశిలించారు. ప్రజా సంకల్పయాత్రలో అభివాదం చేయాల్సి ఉంటుంది. కాబట్టి, గాయం పూర్తిగా తగ్గకపోతే మరింత విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించే అవకాశం ఉంది. ఒకవేళ గాయం తగ్గితే జగన్ అనుకున్నట్లుగానే శనివారం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు.
Next Story