Thu Apr 25 2024 16:16:08 GMT+0000 (Coordinated Universal Time)
కేరళకు అరబ్ దేశం భూరి విరాళం
వరదలతో కకావికలమైన కేరళ రాష్ట్రానికి అరబ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) భారీ విరాళాన్ని ప్రకటించింది. కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్లు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు అబుదాబీ యువరాజు మన ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కేరళ వరదలపై ట్వీట్ చేస్తూ...‘యూఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో ఉంది. వారిని తప్పకుండా ఆదుకుంటాం’ అని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే ఆ దేశం భారీ విరాళాన్ని ప్రకటించి ఉదారతను చాటుకుంది.
Next Story