విరాట్ సేన ఆ రికార్డ్ చెరిపేస్తుందా ...?
బ్రిటిష్ గడ్డపై అసలు సిసలు పరీక్షకు సన్నద్ధమౌతుంది విరాట్ సేన. ఆగస్టు 1 నుంచి మొదలు కాబోయే టెస్ట్ సిరీస్ టీం ఇండియా సత్తాకు నిజమైన అగ్నిపరీక్ష పెట్టనుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ లో గెలిచిన రికార్డ్ భారత్ కి లేదు. గతంలో అజారుద్దీన్, గంగూలీలు వన్డే సిరీస్ లు గెలుచుకొచ్చినా టెస్ట్ సిరీస్ లో మాత్రం ఖంగుతిన్నారు. అయితే విరాట్ సేన టి ట్వంటీ సిరీస్ గెలుచుకుని జోరు మీద కనిపించింది. కానీ వన్డే సిరీస్ లో తడబడి 2 - 1 తేడాతో ఓడింది. ఈ రెండిటికి భిన్నమైనది టెస్ట్ సిరీస్. ఇందులో ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది.
అవకాశం వుంది ....
కోహ్లీ సేనకు టెస్ట్ సిరీస్ గెలుచుకునే ఛాన్స్ లు బాగానే వున్నాయి. ఆతిధ్య జట్టులోని సూపర్ స్టార్స్ అండర్ సన్, బ్రాడ్ లు గాయాల పాలయ్యారు. వీరు టెస్ట్ సిరీస్ కి దూరమయినట్లే. ఇంగ్లాండ్ కౌంటీల్లో పాల్గొనే అశ్విన్, చటేశ్వర పుజారా, ఇషాంత్ శర్మ లు టీం ఇండియా లో వచ్చి చేరారు. ఒక పక్క టీం ఇండియా బలంగా ఉండగా ప్రత్యర్థి ఇంగ్లాండ్ వీక్ అయ్యింది. ఇంతకన్నా సువర్ణావకాశం విరాట్ సేనకు రాదు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారాన్ని సైతం తీర్చుకునే అవకాశం కూడా కోహ్లీ సేన ముందు వుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ కి ముందు సంప్రదాయంగా వస్తున్న ఎస్సెక్స్ తో వార్మప్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ లో లోటు పాట్లు పరిశీలుంచుకుని విరాట్ టీం ఇంగ్లాండ్ పై చారిత్రక విజయం కోరుకుంటున్న భారత క్రీడాభిమానుల కోరిక తీరుస్తుందో లేదో వేచి చూడాలి